భారత్ లో తగ్గుతోన్న కరోనా కేసులు

భారత్ లో తగ్గుతోన్న కరోనా కేసులు

దేశం రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతున్నా మరణాలు పెరగడం కలవర పెడుతోంది. గడిచిన 24 గంటల్లో 1,27,952 కేసులు నమోదవ్వగా 1059 మంది చనిపోయారు. 2,30,814మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా దేశంలో 13,31,648 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రోజు వారి పాజిటివిటి రేటు 7.98శాతంగా ఉంది. భారత్ లో  నిన్నటి వరకు 1,68.98,17,199 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.