24 గంటల్లో 97 వేల కేసులు.. 446 మరణాలు

24 గంటల్లో 97 వేల కేసులు.. 446 మరణాలు

దేశంలో కరోనా  పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా రోజు వారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 96,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య మొత్త కోటి 26 లక్షల 86 వేల 49 కి చేరాయి. నిన్న ఒక్కరోజే 446 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య  1,65,547 కి చేరింది. నిన్న 50,143 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో  కోటి 17లక్షల 32 వేల279 మంది కోలుకున్నారు..ఇంకా 7,88,223 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా నిన్నటి వరకు 8 కోట్ల 31లక్షల 10వేల 926మందికి వ్యాక్సిన్ వేశారు.