బ్యాంకాక్ : ఇండియా స్టార్ షూటర్ జ్యోతి సురేఖ వెన్నం.. ఆసియా చాంపియన్షిప్లో గోల్డ్, సిల్వర్ మెడల్తో మెరిసింది. గురువారం జరిగిన విమెన్స్ కాంపౌండ్ ఫైనల్లో జ్యోతి–పర్నీత్ కౌర్–అదితి స్వామితో కూడిన ఇండియా త్రయం 234–233తో చైనీస్ తైపీపై నెగ్గి స్వర్ణం సాధించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సిల్వర్తో సరిపెట్టుకుంది. హోరాహోరీ షూటాఫ్లో జ్యోతి 8–9తో పర్నీత్ కౌర్ చేతిలో ఓడి రెండో ప్లేస్లో నిలిచింది.
దీంతో పర్నీత్ గోల్డ్ మెడల్తో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది. హాఫ్ టైమ్ వరకు రెండు పాయింట్లు వెనకబడిన పర్నీత్ తర్వాత సూపర్ గురితో ఆకట్టుకుంది. అయితే చివరి రెండు రౌండ్లలో చెలరేగిన జ్యోతి 145–145తో స్కోరును సమం చేయడంతో షూటాఫ్ నిర్వహించారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో అదితి స్వామి–ప్రియాన్షు 156–151తో థాయ్లాండ్పై నెగ్గి బంగారు పతకాన్ని అందుకున్నారు. మెన్స్ కాంపౌండ్లో అభిషేక్ వర్మ 147–146తో జూ జియోహున్ (సౌత్ కొరియా)పై గెలిచి బ్రాంజ్ మెడల్ను సాధించాడు.