జయహో ఇండియా స్టాక్ మార్కెట్ : హాంగ్ కాంగ్ ను బీట్ చేశాం

జయహో ఇండియా స్టాక్ మార్కెట్ : హాంగ్ కాంగ్ ను బీట్ చేశాం

భారత స్టాక్ మార్కెట్ హాంకాంగ్‌ను వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అత్యధిక ఈక్విటీ మార్కెట్‌గా అవతరించింది.  భారత్ ఈ స్థానాన్ని అందుకోవటం ఇదే తొలిసారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.  బ్లూమ్‌బెర్గ్  డేటా ప్రకారం భారతీయ ఎక్స్ఛేంజీలలో జాబితా చేయబడిన షేర్ల సంయుక్త విలువ సోమవారం నాటికి USD 4.33 ట్రిలియన్‌లకు చేరుకుంది.  ఇదే సమయంలో హాంకాంగ్‌కు USD 4.29 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 

భారత్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్  2023డిసెంబర్ 5న తొలిసారిగా 4 ట్రిలియన్‌లను దాటింది, అందులో సగం గత నాలుగేళ్లలోనే వచ్చాయి.  భారత్ కంటే ముందు మొదటి మూడు స్థానాల్లోఅమెరికా, చైనా, జపాన్ ఉన్నాయి. అమెరికా 50.86 ట్రిలియన్ డాలర్లతో తొలిస్థారనంలో ఉండగా,  8.44 ట్రిలియన్ డాలర్లతో  చైనా, 6.3 ట్రిలియన్ డాలర్లతో జపాన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 

వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ బేస్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న ఇన్‌ఫ్లోలు, బలమైన కార్పొరేట్ ఆదాయాలు, పటిష్టమైన నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్‌లో ర్యాలీ నెలకొంది. చైనీస్ అండ్ హాంకాంగ్ స్టాక్‌ల మొత్తం మార్కెట్ విలువ 2021లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుండి $6 ట్రిలియన్లకు పైగా పడిపోయింది. హాంకాంగ్‌లో కొత్త లిస్టులు ఎండిపోయాయి.