సౌతాఫ్రికా, అఫ్గాన్‌‌‌‌తో ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19 టీమ్‌‌‌‌ ట్రై సిరీస్‌‌‌‌

సౌతాఫ్రికా, అఫ్గాన్‌‌‌‌తో ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19 టీమ్‌‌‌‌ ట్రై సిరీస్‌‌‌‌

న్యూఢిల్లీ :  సౌతాఫ్రికాలో వచ్చే నెలలో ఐసీసీ మెన్స్‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌19 వరల్డ్ కప్‌‌‌‌ ముంగిట  ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19 టీమ్  ట్రై సిరీస్‌‌‌‌లో పోటీ పడనుంది. సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్‌‌‌‌, ఇండియా అండర్‌‌‌‌‌‌‌‌19 జట్ల మధ్య ఈ సిరీస్‌‌‌‌  జొహానెస్‌‌‌‌బర్గ్‌‌‌‌లో ఈ నెల 29  నుంచి జరగనుంది. జొహానెస్‌‌‌‌బర్గ్‌‌‌‌లోని ఓల్డ్‌‌‌‌ ఎడ్వర్డియన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ క్లబ్‌‌‌‌లో ప్రతీ టీమ్ ఇతర రెండు దేశాలతో రెండేసి మ్యాచ్‌‌‌‌లు ఆడుతాయని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 

29న అఫ్గాన్‌‌‌‌తో, జనవరి 2న సౌతాఫ్రికాతో  ఇండియా పోటీ పడుతుందని తెలిపింది. జనవరి 10న ఫైనల్‌‌‌‌ జరగనుంది. మరోవైపు అండర్‌‌‌‌‌‌‌‌19 వరల్డ్ కప్‌‌‌‌ జనవరి 19న మొదలవనుంది. ఇండియా గ్రూప్‌‌‌‌–ఎలో బంగ్లాదేశ్‌‌‌‌, ఐర్లాండ్‌‌‌‌, యూఎస్‌‌‌‌ఏతో కలిసి బరిలోకి దిగనుంది.