చెన్నై: ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. 227 రన్స్ తేడాతో ఓడింది. రెండో ఇన్నింగ్స్లో కెప్టెన్ విరాట్ కోహ్లి(72), ఓపెనర్ శుభ్ మన్ గిల్(50) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. వైస్ కెప్టెన్ అజింక్య రహానే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ నదీం డకౌట్ తో పూర్తిగా నిరాశపరిచారు.
తొలి ఇన్నింగ్స్లో 91 పరుగులతో రాణించిన పంత్ కూడా 11 పరుగులకే ఓటయ్యాడు. నయా వాల్ ఛతేశ్వర్ పుజారా 15 పరుగులకే అవుట్ అయి క్రీజును వీడాడు. ఈ క్రమంలో వరుస ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా పరాజయం నుంచి తప్పించుకోలేకపోయింది. కోహ్లి ఒంటరి పోరాటం వృథాగానే మిగిలిపోయింది.