తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. భారత్ 329 ఆలౌట్

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్.. భారత్ 329 ఆలౌట్

చెన్నైలో భారత్ తో  జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్యాటింగ్ కు దిగి పరుగుల ఖాతా తెరవకుండానే తొలి వికెట్ కోల్పోయింది. రోరీ బర్న్స్ ఇషాంత్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు.

అంతకు ముందు  భారత్ తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 300/6 రన్స్ తో రెండో రోజు ఆట మొదలు పెట్టిన టీమిండియా కాసేపటికే పెవిలియన్ బాట పట్టింది. ఇషాంత్ శర్మ,కుల్దీప్ యాదవ్ డకౌటవ్వగా..అక్షర్ పటేల్ 5, సిరాట్ 4 పరుగులకే ఔటయ్యారు. రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 58 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో మొదటి ఇన్నింగ్స్ 329కి తెరపడింది. భారత బ్యాట్స్ మెన్ రోహిత్ 161, రహానే67, పంత్ 58, పూజారా 21 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్ అలీ 4,  స్టోన్  3, జాక్ లీచ్ 2, రూట్  ఒక వికెట్లు తీశారు.