ఐర్లాండ్‌తో తలపడనున్న టీమిండియా

ఐర్లాండ్‌తో తలపడనున్న టీమిండియా

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ టీమిండియా ఐర్లాండ్‌తో  తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్ కు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో భారత్  రెండో స్థానంలో కొనసాగుతుంటే..ఐర్లాండ్‌ చివరి స్థానంలో ఉంది.  ఇక మిగిలిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ , పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఐర్లాండ్‌ చేతిలో భారత్ ఓడి ... ఇంగ్లాండ్ పై తన చివరి మ్యాచ్ లో పాక్ పై నెగ్గితే పాకే సెమీస్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌ మ్యాచ్‌ భారత్ కు కీలకం కానుంది. మూడు వరుస విజయాలతో ఇంగ్లాండ్  ఇప్పటికే సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంది. సెయింట్ జార్జ్ పార్క్‌లో  సాయంత్రం 6 : 30 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది.  కాగా ఇంగ్లండ్ తో జరిగిన గత మ్యాచ్ లో టీమిండియా11 పరుగుల తేడాతో ఓడిపోయింది.