టీ20 సిరీస్‌‌‌‌కు సిద్ధమయిన ఇండియా అమ్మాయిలు..ఇవాళ ఆస్ట్రేలియాతో తొళి టీ20

టీ20 సిరీస్‌‌‌‌కు సిద్ధమయిన ఇండియా అమ్మాయిలు..ఇవాళ ఆస్ట్రేలియాతో తొళి టీ20
  •     నేడు ఆసీస్‌‌తో ఇండియా తొలి టీ20
  •     రా. 7 నుంచి స్పోర్ట్స్‌‌‌‌18, జియో సినిమాలో

నవీ ముంబై :  ఆస్ట్రేలియా విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ చేతిలో వన్డే సిరీస్‌‌‌‌ కోల్పోయిన ఇండియా అమ్మాయిలు టీ20 సిరీస్‌‌‌‌కు సిద్ధమయ్యారు. మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా శుక్రవారం ఇరుజట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ ఏడాదిలో టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ కూడా ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్‌‌‌‌ నుంచే టీమ్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌ మెరుగుపర్చుకోవాలని హర్మన్‌‌‌‌సేన లక్ష్యంగా పెట్టుకుంది. 

అలాగే కంగారూలపై ఉన్న చెత్త రికార్డులను కూడా సవరించుకోవాలని చూస్తోంది. ఇప్పటి వరకు ఆసీస్‌‌‌‌తో 31 టీ20 మ్యాచ్‌‌‌‌లు ఆడితే ఇండియా కేవలం ఆరింటిలో మాత్రమే గెలిచింది. కాబట్టి ఈ సిరీస్‌‌‌‌లో కంగారూలను కట్టడి చేసి సిరీస్‌‌‌‌ నెగ్గాలంటే హర్మన్‌‌‌‌ బృందం సమష్టిగా ఆడాల్సి ఉంటుంది.