ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య శనివారం (డిసెంబర్ 6) మూడో వన్డే ప్రారంభమైంది. విశాఖపట్నం వేదికగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ లో ఇప్పటికే రెండు వన్డేలు జరిగితే తొలి వన్డేలో ఇండియా విజయం సాధించింది. రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలిచి సిరీస్ ను 1-1తో సమం చేసింది.
నిర్ణయాత్మక మూడో వన్డే గెలిచిన వారికి సిరీస్ దక్కుతుందని అందరూ భావిస్తున్న క్రమంలో.. ఇండియా 20 మ్యాచ్ ల తర్వాత టాస్ గెలవటం కలిసొచ్చే అంశం. సొంతగడ్డపై సిరీస్ పోగొట్టుకోకుండా ఉండేందుకు టీమిండియా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా రెండో వన్డే ఇచ్చిన కాన్ఫిడెంట్ తో మూడో వన్డేలోనూ టీమిండియాకు షాక్ ఇవ్వాలని చూస్తోంది.
దాదాపు 20 మ్యాచ్ ల తర్వాత ఇండియా టాస్ గెలిచింది. లాస్ట్ టైమ్.. 2023లో వరల్డ్ కప్ సెమీఫైనల్ లో న్యూజీలాండ్ పై వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచింది టీమిండియా. సిరీస్ దక్కాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఇండియా ఒక మార్పుతో గేమ్ కు వెళ్తోంది. ఆల్ రౌండర్ వాషింగ్ టన్ సుందర్ ప్లేస్ లో తిలక్ వర్మ ను ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకుంది.
విశాఖపట్నంలో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలం. డ్యూ ఫ్యాక్టర్ కారణంగా ఛేజింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తొలి రెండు వన్డేల్లో బౌలింగ్ విభాగాల్లో విఫలమైన టీమిండియా ఈ మ్యాచ్ లో ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉంటేనే సిరీస్ గెలుస్తుంది. టెస్ట్ సిరీస్ గెలిచి ఊపు మీదున్న సఫారీలు వన్డే సిరీస్ కైవసం చేసుకొని ఈ టూర్ ను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తోంది.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, KL రాహుల్(w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్(w), టెంబా బావుమా(c), మాథ్యూ బ్రీట్జ్కే, ఐడెన్ మార్క్రామ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, ఒట్నీల్ బార్ట్మన్
