మార్చి 7న పోఖ్రాన్ లో భారత్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు

మార్చి 7న పోఖ్రాన్ లో భారత్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు

ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ రంగంలో భీకరంగా పోరాడుతున్నాయి. మరోవైపు తైవాన్ ను చేజిక్కించుకోవాలన్న కాంక్షతో చైనా రగిలిపోతోంది. ఈ సమయంలో భారత వాయు సేన (ఎయిర్ ఫోర్స్) కీలక విన్యాసాలను చేపట్టనుంది.  ప్రతి మూడేళ్లకు ఒక సారిఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) వాయుశక్తి పేరుతో విన్యాసాలు నిర్వహిస్తుంటుంది. పూర్తిస్థాయి యుద్ధ సన్నద్ధత కోసం ఇలా చేస్తుంటుంది. దీంతో  శత్రుదేశాలకు జాగ్రత్త అనే హెచ్చరిక పంపుతుంటుంది. చివరిగా 2019లో ఎయిర్ ఫోర్స్ వాయు శక్తి విన్యాసాలను చేపట్టింది.

ఈ ఏడాది మార్చి 7న రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లా పోఖ్రాన్ ప్రాంతంలో ఈ విన్యాసాలు జరగనున్నాయి. 148 యుద్ధ విమానాలు ఇందులో పాల్గొంటున్నాయి. దీని ద్వారా  IAFతన శక్తిని చాటి చెప్పనుంది. అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు మొదటిసారి విన్యాసాల్లోకి చేరనున్నాయి. సుఖోయ్, మిగ్, తేజాస్ విమానాలు పాలుపంచుకుంటాయి. ఆకాశ్, స్పైడర్ క్షిపణి సామర్థ్యాలను కూడా ఐఏఎఫ్ ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ  ముఖ్య అతిథిగా హాజరై ..ప్రత్యక్షంగా చూడనున్నారని .. IAF ప్రకటించింది.

మరిన్ని వార్తల కోసం..

బీహార్ అధికారులే రాష్ట్రాన్ని శాసిస్తున్రు