న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్కు ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. త్రివిధ దళాల మధ్య సమన్వయంకోసం కొత్తగా ఏర్పాటు చేసిన పదవి.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) సీట్లో ఆయనను కూర్చోబెట్టింది. మూడేళ్ల పాటు ఆర్మీ చీఫ్ బాధ్యతలు నిర్వహించిన రావత్.. మంగళవారం(ఈ నెల 31) చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది. రావత్ రిటైర్మెంట్కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూల్స్ సవరించింది. త్రివిధ దళాల చీఫ్ల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రూపంలో వారి సేవలను వినియోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్ వెల్లడించింది. చీఫ్ ఆఫ్డిఫెన్స్ స్టాఫ్ ఆధ్వర్యంలో మిలిటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటుకు కేబినెట్ పోయినవారమే అనుమతిచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఈ డిపార్ట్మెంట్కు బాస్(సీడీఎస్)గా 4 స్టార్ జనరల్ హోదా ఉన్న రిటైర్డ్ చీఫ్(ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్)ను నియమించాలని రూల్ పెట్టింది.
సీడీఎస్ బాధ్యతలు..
♦ ప్రధాని నేతృత్వంలోని న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో సీడీఎస్ కూడా సభ్యుడు
♦ త్రివిధ దళాల మధ్య సమన్వయం కుదర్చడం.. వాటి వ్యవహారాలకు సంబంధించి రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్(పీఎంఏ)గా వ్యవహరించడం
♦ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ చీఫ్లు ముగ్గురూ తమ సర్వీసుకు సంబంధించిన వ్యవహారాల వరకు మాత్రమే రక్షణ మంత్రికి సలహాదారులుగా, మూడింటికీ కలిపి సీడీఎస్ సలహాదారుగా వ్యవహరిస్తారు
♦ ఆయా సర్వీసుల చీఫ్లను కాదని వాటి వ్యవహారాలలో సీడీఎస్ఎలాంటి నిర్ణయం తీసుకునే వీలులేదు
♦ మూడు సర్వీసులకు సంబంధించిన సైబర్, స్పేస్ సంబంధిత వ్యవహారాలలో సీడీఎస్దే బాధ్యత
♦ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, డిఫెన్స్ ప్లానింగ్ కమిటీలలో సీడీఎస్ సభ్యుడిగా ఉంటారు
♦ వివిధ ఆపరేషన్లు, నిర్వహణలలో మూడు సర్వీసుల మధ్య సమన్వయానికి కృషి చేస్తారు
♦ త్రివిధ దళాల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వానికి సాయపడతారు