ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో వైఎస్​ షర్మిల.. సుదీర్ఘ పాదయాత్ర చేసిన మహిళగా చరిత్ర

ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో వైఎస్​ షర్మిల.. సుదీర్ఘ పాదయాత్ర చేసిన మహిళగా చరిత్ర

వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇండియన్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు. ఆమె చేసిన పాదయాత్రకు ఈ అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణలో 2021 అక్టోబర్​ 20 నుంచి చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన వైఎస్​ షర్మిల దాదాపు ఏడాదిన్నరపాటు కొనసాగించింది. 

మొత్తంగా 3,800 కిలోమీటర్ల దూరం నడిచిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా ఇండియన్​ బుక్​ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆగస్టు 15న  షర్మిలను అభినందించి అవార్డు అందజేశారు. పాదయాత్రలో భాగంగా ఆమె సీఎం కేసీఆర్, బీఆర్​ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

ALSO READ:కాన్ఫిడెంట్​ అంటే ఇదీ : 21 ఏళ్లకే 13 ఉద్యోగాలు వదిలేసింది.. ఇప్పుడు 20 లక్షల జీతం..

అవి అప్పట్లో సంచలనం సృష్టించాయి. నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆమెను పోలీసులు అరెస్ట్​ చేశారు. కొన్నాళ్లు యాత్రకు బ్రేక్​పడగా, ఆమె హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. 

గతంలో ఏపీలోనూ పాదయాత్ర చేసినా తెలంగాణలో చేసింది మాత్రం సుదీర్ఘంగా చేసినట్లుగా రికార్డ్స్​నెలకొల్పారు.