వచ్చే నెల 20 నుంచి ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌

వచ్చే నెల 20 నుంచి ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌

ఆసియాలో జరిగే అతిపెద్ద ఫిలిం ఫెస్టివల్స్ లో ఒకటైన ఇండియా ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ తేదీ ఖరారైంది.  నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో 53వ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శించే సినిమాల వివరాలను ఇండియన్ పనోరమా ప్రకటించింది. ఈ సారి 25 ఫీచర్ ఫిలిమ్స్, 20 నాన్ ఫీచర్ ఫిలిమ్స్ ను ప్రదర్శించనున్నారు. 

తెలుగులో సంచలన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, అఖండ చిత్రాలకు గుర్తింపు లభించింది. మెయిన్ స్ర్టీమ్ సినిమా సెక్షన్ లో ప్రదర్శించే ఐదు సినిమాల్లో ఈ రెండు తెలుగు సినిమాలకు చోటు దక్కింది. ఆర్ ఆర్ ఆర్, అఖంఢలతో పాటు మెయిన్ స్ర్టీమ్ సినిమా సెక్షన్ లో కాశ్మీర్ ఫైల్స్ (హిందీ), టోనిక్ ( బెంగాలీ), ధర్మం వీర్ ముక్కడ్ పోస్ట్ థానే (మరాఠీ) సినిమాలను ప్రదర్శించనున్నారు. ఫీచర్ ఫిలిమ్స్ విభాగంలో సినిమా బండి, ఖుదీరాం బోస్ బయోపిక్ ను కూడా ప్రదర్శించనున్నారు. కాగా.. కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు... ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావత్‌ వ్యవహరించనున్నారు.