భారతీయ రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 295 వేగన్లతో ఐదు రైళ్లను అనుసంధానించి మరీ నడిపించి హ్యాట్సాఫ్ అనిపించింది. దీనికి ‘వాసుకి’ అని పేరు పేట్టింది. సౌత్ ఈస్ట్ రైల్వే ( SECR) చేపట్టిన సరికొత్త ప్రయోగం భారతీయ రైల్వే సామర్ధ్యాన్ని వరల్డ్ వైడ్ చాటిచెప్పింది. చత్తీస్ గఢ్ కు చెందిన బిలాయ్ నుంచి అదే రాష్ట్రంలోని కోర్భా వరకు విజయవంతంగా నడిపించింది. ఈ రెండు సేషన్ల మధ్య దాదాపు 224 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఐదు రైళ్లను కనెక్ట్ చేసిన తర్వాత ఈ రైలు పొడవు 3.5 కి.మి. దీనిలో సరుకు రవాణా చేసినట్లు అధికారులు తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ గూడ్స్ రవాణా చేసేందుకే ఈ వాసుకి ని చేపట్టినట్లు చెప్పారు.
గతంలో 177 వేగన్లతో మూడు గూడ్స్ రైళ్లను కనెక్ట్ చేసి నడిపారు. దీనికి ‘సూపర్ అనకొండ’ అనే పేరు పెట్టారు. బిలాస్ పూర్ నుంచి చక్రధర్ పూర్ డివిజన్ల మీదుగా ఈ అనకొండ గూడ్స్ రైలు సాగింది. మొత్తం 177 వేగన్లతో కూడిన మూడు గూడ్స్ రైళ్లను.. ఒక్కొక్కటి 6 వేల హెచ్ పీ సామర్ధ్యం కలిగిన ఇంజన్లతో నడిపింది సౌత్ ఈస్ట్ రైల్వే.