అసక్తిరేపుతున్న 'కార్తికేయ 2' ట్రైలర్‌

అసక్తిరేపుతున్న 'కార్తికేయ 2' ట్రైలర్‌

టాలీవుడ్ యంగ్‌​ హీరో నిఖిల్‌, బ్యూటీఫుల్ అనుపమ పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'కార్తికేయ 2'. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ'కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం మూవీ ట్రైలర్‌ వదిలారు మేకర్స్. 

శాంతను.. 'ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను ఓ సమిధను మాత్రమే, ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది'.. అంటూ గంభీరమైన వాయిస్ తో ట్రైలర్ ఆరంభమౌతుంది.. 'అసలు కృష్ణుడు ఏంటి? ఈ కథను ఆయన నడిపించడం ఏంటి?' అని నిఖిల్ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ కథ హీరో చుట్టూ తీరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఈసారి దర్శకుడు శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారకను ఆధారంగా తీసుకుని ఈ సినిమా తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.