ముషీరాబాద్, వెలుగు: బీజేపీ పాలనలో దేశంలో పేదరికం తగ్గిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కేంద్ర పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. దేశ భవిష్యత్కోసం నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు.
బుధవారం ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా భారత్కరోనాను హ్యాండిల్ చేసిందన్నారు. ప్రధాని మోదీ జాతీయ రహదారులను విస్తరించి, అన్ని నగరాలకు కనెక్టివిటీని పెంచారని చెప్పారు. పర్యటనలో కిషన్రెడ్డితో బీజేపీ నేతలు రమేశ్రామ్, సదానంద గౌడ్, జమాల్పూర్ నందు, నవీన్ గౌడ్, కంచి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.