రీ ఎంట్రీకి శ్రమిస్తున్న బుమ్రా

రీ ఎంట్రీకి శ్రమిస్తున్న బుమ్రా

బెంగళూరు: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రారీఎంట్రీ ఇచ్చేందుకు శ్రమిస్తున్నాడు. వెన్నుగాయం నుంచి కోలుకొని బెంగళూరులోని ఎన్‌‌‌‌‌‌‌‌సీఏలో రిహాబిలిటేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న బుమ్రా నెమ్మదిగా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్‌‌‌‌‌‌‌‌సీఏ నెట్స్‌‌‌‌‌‌‌‌లో రోజుకు ఏడు ఓవర్లు బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. దాంతో, వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌కు అతను రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. 

నెమ్మదిగా వర్కౌట్స్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌ సెషన్స్‌‌‌‌‌‌‌‌ పెంచుతున్నట్టు ఎన్‌‌‌‌‌‌‌‌సీఏ వర్గాలు తెలిపాయి. సర్జరీల తర్వాత కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ కూడా ఎన్‌‌‌‌‌‌‌‌సీఏలో కోలుకుంటున్నారు. బుమ్రాతో పాటు ఈ ఇద్దరు ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.