కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులు

కర్నూలు నుంచి ఇండిగో విమాన సర్వీసులు

భారత్ లో చిన్న నగరాలకు కూడా విమాన సేవలు అందించాలన్న పథకం ఉడాన్. ఈ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నుంచి ఇతర నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. మార్చి 28 నుంచి ఇండిగో సంస్థ కర్నూలు నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరు నగరాలకు విమానాలు నడపనుంది. విశాఖ-కర్నూలు, బెంగళూరు-కర్నూలు, చెన్నై-కర్నూలు మార్గాల్లో వారానికి నాలుగు సర్వీసులు ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ప్రాంతాల కనెక్టింగ్ ను పెంచే దిశగా ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ఇండిగో వర్గాలు తెలిపాయి.