మహేష్, రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. హీరోయిన్గా ఇండోనేషియా బ్యూటీ?

మహేష్, రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. హీరోయిన్గా ఇండోనేషియా బ్యూటీ?

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ అంటే మహేష్ బాబు(Mahesh babu), రాజమౌళి(Rajamouli) మూవీ అనే చెప్పాలి. ఏ ముహూర్తాన ఈ కాంబో సెట్ అయిందో తెలియదు కానీ.. రోజురోజుకి ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో, హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి చిన్న న్యూస్ వినిపిస్తున్న క్షణాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే కథ సిద్దమవ్వగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది ఈ మూవీ. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ సినిమా ఈ ఏడాది లాంఛనంగా మొదలుకానుంది. 

తాజాగా ఈ సినిమా నుండి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇండోనేషియన్ బ్యూటీని సెలెక్ట్ చేశారట జక్కన్న. ఆ బ్యూటీ మరెవరో కాదు ఎలిజబెత్ చెల్సియా ఇస్లాన్‌. దీంతో రాజమౌళి నెక్స్ట్ సినిమా హీరోయిన్ ఈమెనే అంటూ ఒక ఫోటో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ అమ్మడు గురించి తెలుసుకోవడానికి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇటీవలే ఈ అమ్మడు ఇండియాకు వచ్చిందని, లుక్ టెస్ట్ కూడా జరిగిందని టాక్ నడుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.

ఈ ఏడాదే మొదలుకానున్న ఈ ప్రెస్టీజియస్ సినిమా కోసం స్టార్ క్యాస్ట్ సెలెక్షన్, లొకేషన్ హంటింగ్ లో ఉన్నారు రాజమౌళి. క్రియేటీవ్ కమర్షియల్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి ఆస్థాన సంగీతం దర్శకుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలువడం ఖాయంగా కనిపిస్తోంది.