పాడైన వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువ ఇంజినీర్

పాడైన వ్యర్థాలతో అద్భుతాలు సృష్టిస్తున్న యువ ఇంజినీర్

మధ్యప్రదేశ్ ఇండోర్ లో మెటాలిక్ స్క్రాప్ లతో విలువైన.. ఆకర్షణీయమైన వస్తువులను తయారు చేస్తున్నారు దేవల్ వర్మ. ఇప్పటి వరకు 6 వేల కిలోల మెటల్ స్క్రాప్ రీ సైకిల్ చేసినట్లు తెలిపారు. దుబాయి, అమెరికా, ఇటలీ , సింగపూర్ లకు స్క్రాప్ తో తయారు చేసిన వస్తువులను పంపించినట్లు తెలిపారు దేవల్ వర్మ. స్క్రాప్ తో తయారు చేసిన ఇండియా మ్యాప్ ని ఖర్గోన్ మున్సిపాలిటీకి ఇచ్చారని... దానికి సోనే కి చిడియా అని పేరు పెట్టినట్లు తెలిపారు. ప్రపంచంలో మెటల్ స్క్రాప్, ఈ-వేస్ట్ , ప్లాస్టిక్ స్క్రాప్ పెరుగుతుందని... దాన్ని రీసైకిల్ చేసి వేస్టేజ్ ని తగ్గించవచ్చన్నారు దేవల్ వర్మ.

రూపాయికే కిలో ఉల్లి అమ్మి నిరసన తెలిపిన రైతులు