కుషాయిగూడ, వెలుగు : ఈసీఐఎల్సంస్థ క్యాంటీన్లో ‘పప్పులో పాము పిల్ల’ ఘటనపై మేనేజ్మెంట్ శనివారం విచారణ కమిటీ వేసింది. జీఎం, ఏజీఎంలతో పాటు ఎంప్లాయీస్, ఆఫీసర్స్ అసోసియేషన్, మెడికల్ఆఫీసర్ నుంచి ఒక్కొక్కరు చొప్పున కమిటీ సభ్యులుగా ఉన్నారు.
ఈసీఐఎల్ సెంట్రల్కమిటీలోని క్యాంటీన్..చర్లపల్లిలోని ఈవీఎంల తయారీ సంస్థ ఉద్యోగులకు భోజనం సరాఫరా చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన కార్మికుల్లో కొందరు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. అయితే, పప్పులో చనిపోయిన పాము పిల్ల ఫొటోలు బయటకు ఎలా వచ్చాయంటూ కమిటీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.