పప్పులో పాము పిల్లపై విచారణ కమిటీ.. ఫొటోలు బయటకు రావడంపై ఆరా

పప్పులో పాము పిల్లపై విచారణ కమిటీ.. ఫొటోలు బయటకు రావడంపై ఆరా

కుషాయిగూడ, వెలుగు : ఈసీఐఎల్​సంస్థ క్యాంటీన్​లో ‘పప్పులో పాము పిల్ల’ ఘటనపై మేనేజ్​మెంట్ శనివారం విచారణ కమిటీ వేసింది. జీఎం, ఏజీఎంలతో పాటు ఎంప్లాయీస్​, ఆఫీసర్స్​ అసోసియేషన్,​ మెడికల్​ఆఫీసర్​ నుంచి ఒక్కొక్కరు చొప్పున కమిటీ సభ్యులుగా ఉన్నారు. 

ఈసీఐఎల్ ​సెంట్రల్​కమిటీలోని క్యాంటీన్..​చర్లపల్లిలోని ఈవీఎంల తయారీ సంస్థ ఉద్యోగులకు భోజనం సరాఫరా చేస్తోంది. శుక్రవారం మధ్యాహ్న భోజనం చేసిన కార్మికుల్లో కొందరు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. అయితే,  పప్పు​లో చనిపోయిన పాము పిల్ల ఫొటోలు బయటకు ఎలా వచ్చాయంటూ కమిటీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.