ప్రధానిని తిట్టడం దేశద్రోహం కాదు.. కర్నాటక హైకోర్టు

ప్రధానిని తిట్టడం దేశద్రోహం కాదు..  కర్నాటక హైకోర్టు

బెంగళూరు: ప్రధానిని అసభ్యకరమైన పదాలతో తిట్టడం అభ్యంతరకరం, బాధ్యతారాహిత్యమే.. దేశద్రోహం మాత్రం కాదని కర్నాటక హైకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు ఓ స్కూల్ మేనేజ్ మెంట్ పై దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరసత్వ రిజిస్ట్రార్(ఎన్ఆర్​సీ)ను వ్యతిరేకిస్తూ 2020 జనవరి 6, 21న బీదర్​లోని షహీన్ స్కూల్​లో పిల్లలతో డ్రామా ఆడించారు. 

ఈ సందర్భంగా ప్రధానిని చెప్పుతో కొట్టాలంటూ మాట్లాడించారు. దీనిపై ఏబీవీపీ కార్యకర్త నీలేశ్​ రక్షాల ఆ స్కూల్  యాజమాన్యంపై కేసు వేశారు. ఈ కేసుపై హైకోర్టులోని కల్బర్గి బెంచ్  విచారణ జరిపింది. సెక్షన్ 153(ఏ), ఐపీసీ​లో పేర్కొన్న విషయాలు ఈ కేసులో లేవని బెంచ్  తెలిపింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొట్టాలనడం అవమానకరమే. ప్రభుత్వ విధానాలను నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని అవమానించడం సరికాదు” అని వ్యాఖ్యానించింది.