మాల్ ప్రాక్టీస్ కు సహకరించిన నలుగురు లెక్చరర్లు సస్పెండ్

మాల్ ప్రాక్టీస్ కు సహకరించిన నలుగురు లెక్చరర్లు సస్పెండ్

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివ్​నగర్​జూనియర్​కాలేజీలో ఇంటర్​ఎగ్జామ్స్​సందర్భంగా మాస్​ కాపీయింగ్​కు సహకరించారని ఇద్దరు లెక్చరర్లతో పాటు, ఎగ్జామ్​సెంటర్​చీఫ్​సూపరింటెండెంట్, డిపార్ట్​మెంట్ఆఫీసర్ లను సస్పెండ్​చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సదాశివ్​నగర్​జూనియర్​కాలేజీలో ఇంటర్​సెకండ్​ఇయర్​పరీక్షల సందర్భంగా సెంటర్​బయట బ్యాగుతో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించాడు. వారిని చూసిన వెంటనే బ్యాగ్​వదిలి పారిపోబోగా పట్టుకున్నారు.

అతడిని పట్టుకుని ఎంక్వైరీ చేయగా తన పేరు ఎండీ ఇష్రత్​అని కాలేజీలో హిందీ లెక్చరర్​నని చెప్పాడు. బ్యాగులో చెక్​చేయగా హిందీ ఎగ్జామ్​కు సంబంధించిన చిట్టీలు కనిపించాయి. చిట్టీలను సెంటర్​లో ఉన్న లెక్చరర్​రంజిత్​కు ఇచ్చేందుకు వచ్చానని చెప్పాడు. దీంతో లెక్చరర్లు ఇశ్రత్, రంజిత్​పై మాల్​ప్రాక్టీస్​కింద కేసు నమోదు చేశారు. దీంతో స్పందించిన ఇంటర్​బోర్డు లెక్చరర్లు ఇశ్రత్, బి.రంజిత్​తో పాటు ఎగ్జామినేషన్​సెంటర్​చీఫ్​సూపరింటెండెంట్​ప్రతాప్​లింగం, డిపార్ట్​మెంట్​ఆఫీసర్​రాజాగౌడ్​లను సస్పెండ్​ చేశారు. సెంటర్​లో కాపీయింగ్​జరగలేదని ఇంటర్మీడియట్​కామారెడ్డి జిల్లా నోడల్​ ఆఫీసర్​ షేక్​సలాం తెలిపారు.  

Also Read : ఆ రెండు జిల్లాలో.. నలుగురు ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లు డిబార్