ఇంటర్  స్టూడెంట్ మిస్సింగ్

ఇంటర్  స్టూడెంట్ మిస్సింగ్

ఉప్పల్, వెలుగు: ఇంటర్ స్టూడెంట్ మిస్సింగ్ ఘటన నాచారం పీఎస్ పరిధిలో జరిగింది. హెచ్ఎంటీనగర్ లో ఉంటున్న కుమారస్వామి కొడుకు కుందే చరణ్​ కుమార్(17) హబ్సి
గూడలోని ఓ కాలేజీలో ఇంటర్ సెకండియర్​ దువుతున్నాడు.   స్పెషల్ క్లాస్ ఉందని ఈ నెల 16న ఉదయం 10 గంటలకు బయటికెళ్లిన చరణ్ కుమార్ తిరిగి రాలేదు.  కుమారస్వామి  చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో అతడు సోమవారం పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తుకారాంగేట్ లో వివాహిత
వివాహిత మిస్సింగ్ ఘటన తుకారాంగేట్ పీఎస్ పరిధిలో జరిగింది. అడ్డగుట్టకి చెందిన మురళీకృష్ణ భార్య శ్వేత(35) ఈ నెల 19న షాపింగ్ కోసం బయటికెళ్లి తిరిగి రాలేదు. భర్త ఆమె సెల్ ఫోన్ కి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది.  దీంతో మురళీకృష్ణ సోమవారం తుకారాంగేట్ పీఎస్ లో కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.