రాజకీయాలకన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యం

రాజకీయాలకన్నా రైతుల ప్రయోజనాలే ముఖ్యం

రాజకీయాలకన్నా రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమన్నారు INLD MLA అభయ్‌ సింగ్‌ చౌతాలా. రైతుల బాధను అర్థం చేసుకోని వ్యవస్థలో ఉండటం తనకు ఇష్టం లేదన్నారు. తమ కుటుంబానికి దశాబ్దాలుగా రైతులు అండగా ఉన్నారని అభయ్‌ సింగ్‌ తెలిపారు.

దివంగత రైతు నేత, కేంద్ర మాజీ మంత్రి దేవిసింగ్‌ మనవడు అయిన అభయ్ సింగ్‌ నిన్న(బుధవారం) తన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశారు. తన మద్దతుదారులతో కలిసి ఆయన ట్రాక్టర్‌లో అసెంబ్లీకి చేరుకున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్‌ జ్ఞాన్‌ చంద్‌ గుప్తాకు తన రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు.