ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన

ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన
  •     వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్​
  •     ప్రతిభ చూపిన గురుకులాల విద్యార్థులు

వెలుగు, నెట్​వర్క్​: ఇంటర్​ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ముఖ్యంగా గురుకులాల విద్యార్థులు టాపర్​ స్థానాలకు పోటీ పడ్డారు. ​రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. ఇంటర్​ సెకండియర్​ ఫలితాల్లో 82.12 శాతం సాధించగా, ఫస్ట్​ఇయర్​లో 71.31 శాతంతో 5వ స్థానంలో నిలిచినట్లు జిల్లా ఇంటర్ పరీక్షల నిర్వహణ అధికారి వీరేందర్ తెలిపారు. జనగామ జిల్లాలో 70.92 శాతం విద్యార్థులు పాస్​ అయ్యారు. 

మహబూబాబాద్​ జిల్లాలో 49.11 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండ జిల్లాలో సెకండ్​ ఇయర్​లో 78.57 శాతం పర్సంటేజీతో రాష్ట్రంలో జిల్లా 8వ స్థానంలో ఉండగా, ఫస్ట్​ ఇయర్​లో 69.16 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 7వ స్థానంలో నిలిచింది.  వరంగల్​ జిల్లాలో సెకండియర్​లో 60.80 శాతంతో 32వ శాతం, ఫస్ట్​ఇయర్​లో 52.81 శాతం పర్సంటేజీతో  రాష్ట్రంలో 30 స్థానంలో ఉన్నది. 

ఖమ్మం జిల్లాలో ఫస్టియర్​ ఫలితాల్లో 72.06 శాతంతో రాష్ట్రంలో 4వ స్థానంలో ఉండగా, సెకండియర్​లో 81.60 శాతంతో 6వ స్థానంలో నిలిచింది. కాగా, గురుకులాలతో పాటు ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఇంటర్​ ఫలితాల్లో సత్తా చాటారు.భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇంటర్​ సెకండ్ ఇయర్​లో 77.80 శాతం, ఫస్ట్ ఇయర్​లో 62.71శాతం స్టూడెంట్స్ రిజల్ట్ సాధించారు. రాష్ట్ర స్థాయిలో సెకండ్ ఇయర్​లో తొమ్మిదో స్థానంలో, ఫస్ట్ ఇయర్​లో 11స్థానంలో జిల్లా నిలిచింది.