హరీశ్ రావు పిలిచినా ఎమ్మెల్యే రాలేదు

హరీశ్ రావు పిలిచినా ఎమ్మెల్యే రాలేదు
  •     టీ డయాగ్నొస్టిక్​ సెంటర్ ‌‌ఓపెనింగ్ ‌‌కు రాని ఎమ్మెల్యే  
  •     జడ్పీ చైర్మన్​ ఆధర్యంలోప్రోగ్రాం

యాదాద్రి, వెలుగు :  బీఆర్ఎస్ ‌‌లో జడ్పీ చైర్ ‌‌ ‌‌ పర్సన్ ‌‌, ఎమ్మెల్యే మధ్య సఖ్యత కుదరలేదు.  టీ డయాగ్నొస్టిక్ ‌‌ సెంటర్ ‌‌ ‌‌ ఓపెనింగ్ ‌‌కు ఎమ్మెల్యేకు ఆహ్వానం ఉన్నా హాజరు కాలేదు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా టీ డయాగ్నొస్టిక్​ సెంటర్లను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు వర్చువల్ ‌‌గా ప్రారంభించారు.  భువనగిరిలోని టీ డయాగ్నొస్టిక్ ‌‌ సెంటర్​ఓపెనింగ్ ‌‌లో పాల్గొనాలని ఎమ్మెల్యే శేఖర్​రెడ్డిని  మంత్రి హరీశ్​రావు ఆహ్వానించారు. 

అయినా ఆయన పాల్గొనలేదు. దీంతో జడ్పీ చైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి ప్రోగ్రామ్ ‌‌ నిర్వహించారు.  డయాగ్నొస్టిక్​ కొత్త బిల్డింగ్ ‌‌తో పాటు మిషనరీ, శాంపిల్స్​ సేకరించడానికి ఏర్పాటు చేసిన 5 డీ అంబులెన్స్ ‌‌ను జెండా ఊపి ప్రారంభించారు. 

ముందు నుంచీ అంతే..

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డికి, జడ్పీ చైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు. మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డి కొడుకైన సందీప్ ‌‌ రెడ్డి  భువనగిరి ఎమ్మెల్యే టికెట్​ఆశిస్తుండగా.. మంత్రి గుంటకండ్ల జగదీశ్​ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.  ఈ కారణమే ఇద్దరి మధ్య దూరం పెంచిందని పార్టీ నేతలు చెబుతున్నారు.  పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఇద్దరూ కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ.  

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భువనగిరి నియోజకవర్గం రాయగిరిలో నిర్వహించిన ఆధ్యాత్మికత దినోత్సవానికి ఎమ్మెల్యే శేఖర్​రెడ్డికి ఆహ్వానమే అందలేదు. ఈ ప్రోగ్రాంకు శేఖర్​రెడ్డి రాకున్నా.. మంత్రి గుంటకండ్ల, జడ్పీ చైర్మన్​ ఎలిమినేటి సందీప్​రెడ్డి హాజరయ్యారు. ఈ విషయంలో ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి అలకవహించిన సంగతి తెలిసిందే.