తెలంగాణ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. నిమిషం తర్వాత కూడా లోనికి అనుమతించకపోవడంతో అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. అయితే రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లోని శ్రీ చైతన్య గ్రూప్ 1 పరీక్షా కేంద్రంలో గందరగోళం నెలకొంది. పరీక్ష సమయం ముగియడంతో, ఇన్విజిలేటర్ అరగంట ముందుగానే పేపర్లు తీసుకున్నాడు.
అయితే , బయటకు వచ్చిన తర్వాత అభ్యర్థులకు ఇంకా అరగంట ఉందని తెలిసింది. దీంతో అభ్యర్థులు తమ పేపర్ తిరిగి ఇవ్వాలని ఇన్విజిలేటర్ను కోరారు. అయితే ఆ పేపర్ తిరిగి ఇచ్చేది లేదని తేల్చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ చైతన్య కాలేజీ క్యాంపస్లో దాదాపు 40 మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఇప్పటికీ గ్రూప్ 1 పేపర్ లీక్ కావడంతో డిప్రెషన్ లో ఉన్న విద్యార్థులకు ఇలాంటి సంఘటన మరింత ఆందోళనకు దారితీసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.