బోణీ కొట్టిన సన్ రైజర్స్ .. పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ

బోణీ కొట్టిన సన్ రైజర్స్ .. పంజాబ్ పై గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ 14 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టింది. పంజాబ్ కింగ్స్ పై  9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.121 పరుగుల టార్గెట్ ను 18.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి చేధించింది. దీంతో  పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. హైదరాబాద్ ఓపెనర్లలో వార్నర్ 37 పరుగులకే ఔటవ్వగా.. మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో 63 పరుగుల(నాటౌట్) తో చెలరేగడంతో హైదరాబాద్ గెలుపు ఈజీ అయ్యింది. పంజాబ్ బౌలర్లలో అలెన్ కు ఒక వికెట్ పడింది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్  ను హైదరాబాద్ చిత్తు చేసింది. 19.4 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది. మయాంక్ అగర్వాల్ 22 శారుక్ ఖాన్ 22 పరుగులు మినహా ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు. హైదరాబాద్ బౌలర్లలో  ఖలీల్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2, భువనేశ్వర్, కౌల్, రశీద్ ఖాన్ లకు తలో ఒక వికెట్ పడ్డాయి.