ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 రన్స్ చేసింది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(103) అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుస ఓటమిలతో సతమతమవుతున్న ముంబైకి ఈ మ్యాచ్ లో భారీ టార్గెట్ ముందుండటంతో మళ్లీ పరీక్షే అంటున్నారు. మరి చూడాలి ఈ మ్యాచ్ లోనైనా గెలిచి ఫస్ట్ విక్టరీని తన ఖాతాలో వేసుకుంటుందో లేదో.