ఫిబ్రవరి 7, 8న ఐపీఎల్‌‌‌‌ మెగా ఆక్షన్‌‌ !

ఫిబ్రవరి 7, 8న ఐపీఎల్‌‌‌‌ మెగా ఆక్షన్‌‌ !

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‌ ప్లేయర్స్‌‌ మెగా ఆక్షన్‌‌ను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్‌‌ చేస్తోంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మెగా ఆక్షన్‌‌ ఉంటుందని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్‌‌ అధికారి వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. అయితే, కరోనా వేరియంట్‌‌ ఒమిక్రాన్‌‌ ముప్పు నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే ఆక్షన్‌‌ వేదిక వేరే దేశానికి మారే అవకాశముందన్నారు. ఈ ఏడాది నుంచి జట్ల సంఖ్య పదికి చేరడంతో మెగా ఆక్షన్‌‌ తప్పనిసరి అయ్యింది.