IPL ప్రారంభ వేడుకలు క్యాన్సిల్ : ఆ డబ్బుతో అమర జవాన్ల కుటుంబాలకు విరాళం

IPL ప్రారంభ వేడుకలు క్యాన్సిల్ : ఆ డబ్బుతో అమర జవాన్ల కుటుంబాలకు విరాళం

న్యూఢిల్లీ:  పుల్వామా ఉగ్రవాదుల దాడిలో CRPF జవాన్లు మృతి చెందారు. చనిపోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు BCCI మంచి నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల సంక్షేమం కోసం రూ.20 కోట్లను ప్రకటించింది BCCI. ప్రతి సంవత్సరం IPL ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తారు.  2019లో జరగనున్న IPL సీజన్ ప్రారంభ వేడుకలను రద్దు చేసి, ఆ డబ్బును పుల్వామా ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్మీ అధికారులకు రూ. 20 కోట్ల విరాళాన్ని అందజేసే ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ పాల్గొననున్నారు. రూ. 20 కోట్లను COA మంజూరు చేసింది. చెన్నైలో మార్చి 23వ తేదీన IPL కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి.