ఐపీఎల్‌‌‌‌ స్పాన్సర్‌‌షిప్‌‌ 20% పెరిగింది!

ఐపీఎల్‌‌‌‌ స్పాన్సర్‌‌షిప్‌‌ 20% పెరిగింది!

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్‌‌ క్రికెటర్లకే కాదు.. బ్రాడ్‌‌కాస్టర్లకూ కాసుల పంట పండించబోతున్నది. లీగ్‌‌ అఫీషియల్‌‌ బ్రాడ్‌‌కాస్టర్‌‌ స్టార్‌‌ స్పోర్ట్స్‌‌.. ఆన్‌‌–ఎయిర్‌‌ స్పాన్సర్‌‌షిప్‌‌ను 20 శాతం పెంచింది. ఇప్పటికే పెంచిన రేట్లతో 10 కంపెనీలతో స్పాన్సర్‌‌షిప్‌‌ను కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. క్రెడ్‌‌, డ్రీమ్‌‌ ఎలెవన్‌‌, బైజూస్‌‌, టాటా, ఏషియన్‌‌ పెయింట్స్‌‌, స్పార్టీఫై, మీషో, స్విగ్గీ ఇన్‌‌స్టామార్ట్‌‌, కమలాపసంద్‌‌ అండ్‌‌ పెప్సీ ఇందులో ఉన్నట్లు సమాచారం. కో ప్రజెంటింగ్‌‌ పార్ట్‌‌నర్స్‌‌ రూ. 160 కోట్లు, అసోసియేట్‌‌ స్పాన్సర్స్‌‌కు రూ. 90 కోట్లుగా రేటు నిర్ణయించింది. ఐపీఎల్‌‌ 2021లో ఇవి 130–140 కోట్లు, 60–65 కోట్లుగా ఉన్నాయి.