17 ఏళ్ల తర్వాత ​ ఫార్మాలోకి నిమ్మగడ్డ ప్రసాద్ రీ-ఎంట్రీ

17 ఏళ్ల తర్వాత ​ ఫార్మాలోకి నిమ్మగడ్డ ప్రసాద్ రీ-ఎంట్రీ

హైదరాబాద్​, వెలుగు: గ్లోబల్​ ఫార్మాస్యూటికల్​ కంపెనీ వియాట్రిస్​ యాక్టివ్​ ఫార్మాస్యూటికల్​ ఇన్​గ్రీడియెంట్​(ఏపీఐ) ఆపరేషన్స్​ను ఐక్వెస్ట్​ ఎంటర్​ప్రైజస్​ చేజిక్కించుకుంది. ఇందుకోసం డెఫినిటివ్​ అగ్రిమెంట్ ​కుదుర్చుకున్నట్లు ఐక్వెస్ట్​ సోమవారం ప్రకటించింది. గ్లోబల్​ లెవెల్​ కాంపిటీటివ్​ బిడ్స్​లో  తాము ప్రిఫర్డ్​ ఇన్వెస్టర్​గా ఎంపికైనట్లు వెల్లడించింది. హైదరాబాద్​లోని మూడు, విశాఖపట్నంలోని మరో మూడు అంటే మొత్తం ఆరు ఏపీఐ మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీలు, హైదరాబాద్​లోని రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ సెంటర్​ ఇకమీదట తమ చేతికి వస్తాయని ఐక్వెస్ట్​​ వివరించింది.

తమ టీములోని చాలా మంది గతంలో మ్యాట్రిక్స్​ ల్యాబొరేటరీస్​లో పనిచేశారని, ఆ తర్వాత 2006 లో మ్యాట్రిక్స్​ల్యాబొరేటరీస్​ ​ మైలాన్​ చేతికి వెళ్లిందని ఐక్వెస్ట్‌‌ పేర్కొంది. 2020 లో మరోసారి మైలాన్​ చేతులు మారి వియాట్రిస్​గా అవతరించినట్లు తెలిపింది.  ఈ కొనుగోలుకు మరో విశేషమేమంటే, 17 ఏళ్ల పాటు ఫార్మా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్​ (మ్యాట్రిక్స్​ ల్యాబొరేటరీస్​ ప్రమోటర్​) మళ్లీ అదే ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లవుతుంది. మ్యాట్రిక్స్, కేర్​ హాస్పిటల్స్​ వంటి కంపెనీల బిజినెస్​ల స్కేల్​పెంచడం ద్వారా షేర్​హోల్డర్లకు సంపద సమకూర్చిన సీరియల్​ ఎంట్రప్రెనూర్​గా నిమ్మగడ్డ ప్రసాద్​ పేరిందిన విషయం తెలిసిందే.