
హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వియాట్రిస్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రీడియెంట్(ఏపీఐ) ఆపరేషన్స్ను ఐక్వెస్ట్ ఎంటర్ప్రైజస్ చేజిక్కించుకుంది. ఇందుకోసం డెఫినిటివ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఐక్వెస్ట్ సోమవారం ప్రకటించింది. గ్లోబల్ లెవెల్ కాంపిటీటివ్ బిడ్స్లో తాము ప్రిఫర్డ్ ఇన్వెస్టర్గా ఎంపికైనట్లు వెల్లడించింది. హైదరాబాద్లోని మూడు, విశాఖపట్నంలోని మరో మూడు అంటే మొత్తం ఆరు ఏపీఐ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలు, హైదరాబాద్లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇకమీదట తమ చేతికి వస్తాయని ఐక్వెస్ట్ వివరించింది.
తమ టీములోని చాలా మంది గతంలో మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్లో పనిచేశారని, ఆ తర్వాత 2006 లో మ్యాట్రిక్స్ల్యాబొరేటరీస్ మైలాన్ చేతికి వెళ్లిందని ఐక్వెస్ట్ పేర్కొంది. 2020 లో మరోసారి మైలాన్ చేతులు మారి వియాట్రిస్గా అవతరించినట్లు తెలిపింది. ఈ కొనుగోలుకు మరో విశేషమేమంటే, 17 ఏళ్ల పాటు ఫార్మా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ (మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్ ప్రమోటర్) మళ్లీ అదే ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లవుతుంది. మ్యాట్రిక్స్, కేర్ హాస్పిటల్స్ వంటి కంపెనీల బిజినెస్ల స్కేల్పెంచడం ద్వారా షేర్హోల్డర్లకు సంపద సమకూర్చిన సీరియల్ ఎంట్రప్రెనూర్గా నిమ్మగడ్డ ప్రసాద్ పేరిందిన విషయం తెలిసిందే.