ఇది 3400 ఏళ్ల నాటి పురాతన కోట. ఇరాక్లోని కుర్దిస్థాన్ రీజియన్లో ఉంది. అయితే, ఏంటట.. అందులో ఏముందట.. ఎన్ని కోటల్లేవ్ అట్లాంటివి? అంటారా! ఉన్నాయి.. కానీ, ఈ కోట చాలా స్పెషల్. ఎందుకంటే, నదిలో మునిగిపోయిన కోట అది. ఇప్పుడు ఇరాక్లో కరువు కోరలు చాచడంతో అక్కడి నదులు, రిజర్వాయర్లు ఎండిపోయాయి. దీంతో ఇప్పుడు ఈ కోట ఇలా బయటపడింది. ఆర్కియాలజిస్టులకు పనిపెట్టింది. మిట్టనీ ఎంపైర్కు చెందిన రాజుల కోట అని పురాతత్వ నిపుణులు చెబుతున్నారు.
ఏన్షియంట్ నియర్ ఈస్ట్ ఎంపైర్స్లో అతి తక్కువ పరిశోధనలు జరిగింది ఈ మిట్టనీ ఎంపైర్పైనేనని కుర్దిష్– జర్మనీ ఆర్కియాలజిస్టులు బృందం ప్రెస్ రిలీజ్లో చెప్పింది. ఇటీవలి కాలంలో ఇక్కడ దొరికిన ఆర్కియాలాజికల్ ఆనవాళ్లు చాలా ముఖ్యమైనవని కుర్దిష్ ఆర్కియాలజిస్ట్ హసన్ అహ్మద్ ఖాసిం చెప్పారు. నదిలోపల ఉన్న ఈ కోట ఎత్తు 65 అడుగులు అని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. పూర్తిగా మట్టితో తయారు చేసిన ఇటుకలతోనే కోటను కట్టారని, ఒక్కొక్క గోడ మందం 6.6 అడుగులుందని యూనివర్సిటీ ఆఫ్ బుబింజెన్లోని ఇనిస్టిట్యూట్ ఫర్ ఏన్షియంట్ నియర్ ఈస్టర్న్ స్టడీస్ ఆర్కియాలజిస్ట్ ఇవానా పుల్జిజ్ చెప్పారు. ఈ ప్రాంతంలో మిట్టనీ కాలానికి చెందిన వాల్ పెయింటింగ్స్ బయటపడిన రెండో చారిత్రక ప్రదేశం ఇది మాత్రమేనని అన్నారు. అంతేగాకుండా అక్కడి లిపిని కూడా సైంటిస్టులు గుర్తించారు. దాని వల్ల మిట్టనీ ఎంపైర్ చరిత్ర తెలుసుకునే అవకాశం దొరుకుతుందన్నారు. అన్నట్టు, ఆ కోట పేరు.. అది బయటపడిన నది పేరు చెప్పలేదు కదూ! ఆ కోట పేరు ‘కెమునే’. టైగ్రిస్ నదిపై కట్టిన మోసూల్ డ్యాంలో కరువుతో ఇలా తేలి బయటపడింది.