V6 News

ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు  : మంగళపూడి వెంకటేశ్వర్లు

ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు  : మంగళపూడి వెంకటేశ్వర్లు

కూసుమంచి, వెలుగు: ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జిల్లా ఇరిగేషన్​ చీఫ్​ ఇంజినీర్​ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్​ను పరిశీలించారు. వానాకాలానికి ముందు రిజర్వాయర్​కు చేయాల్సిన మైనర్​ రిపేర్లు, రిజర్వాయర్​ ప్రొటెక్షన్​ గురించి ఆరా తీశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్ఎస్పీ ఆయకట్టు 2లక్షల 54వేల 270 ఎకరాలు, ఐడీఎస్​ కింద 42 వేలు, మైనర్​ ఇరిగేషన్​కింద లక్ష ఎకరాలు ఇలా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగుకు నీరందుతుందన్నారు. మధిర నియోజకవర్గంలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. జిల్లాలో 300 చెరువులను నీటితో నింపామన్నారు. పాలేరులో పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఐబీ ఈఈ రమేశ్​రెడ్డి, డీఈ శ్రీనివాస్, ఏఈలు ఉన్నారు