
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మొదట మార్చి 28, ఆ తర్వాత మే30 నుంచి జూలై 4కి పోస్ట్ఫోన్ అయింది. ఇప్పుడు మరోసారి వాయిదా పడిందనే టాక్ సినీ వర్గాల్లో మొదలైంది.
ఈ విషయంపై కింగ్డమ్ మేకర్స్ ఇటీవలే గట్టిగానే స్పందించారు. కింగ్డమ్ వాయిదాపై సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. అనుకున్న డేట్కే సాలిడ్గా వస్తున్నామని కూడా ప్రకటిస్తూ.. రిలీజ్కు ఇంకా నెల ఉందని కొత్త పోస్టర్ కూడా ఇచ్చారు.
For every fan who waited...
— Shloka Entertainments (@ShlokaEnts) June 3, 2025
For every roar held back...
Your KING returns in 30 days. 👑⏳
అవసరం అయితే థియేటర్లు తగలపెట్టేదాం..💥💥😎 #Kingdom USA premiers on July 3rd
North America by Release by @ShlokaEnts
@TheDeverakonda @gowtam19 @AnirudhOfficial #BhagyashriBorse… pic.twitter.com/cfsGwp4cVc
అయినప్పటికీ.. కింగ్డమ్ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దానికితోడు మరో డేట్ కూడా లాక్ చేసుకుందనే టాక్ చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలోనే కింగ్డమ్ జూలై 25న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సినీ వర్గాల టాక్.
కింగ్డమ్ (జూలై 4వ) తేదీని.. నితిన్ తమ్ముడు మూవీ లాక్ చేసుకోవడంతో.. ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఇందులో భాగంగా తమ్ముడు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియో కూడా షేర్ చేస్తూ.. జూన్ 11న తమ్ముడు ట్రైలర్ వస్తోందని తెలిపారు.
Igniting the excitement with #BangerFromThammudu!🔥
— Sri Venkateswara Creations (@SVC_official) June 10, 2025
The Blazing #Thammudu Theatrical Trailer Tomorrow at 5PM💥💥
A #SriramVenu Film🎬@AJANEESHB Musical🎶#ThammuduOnJuly4th 🎯@actor_nithiin @gowda_sapthami #Laya #SaurabhSachdeva @VarshaBollamma #Swasika #DilRaju #Shirish… pic.twitter.com/38k6wxsfX9
కింగ్డమ్ వాయిదాకు కారణం ఎవరు:
గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న కింగ్డమ్ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈసారి జూలై 4నుంచి వాయిదా పడటానికి అనిరుధ్ ముఖ్య కారణమని సమాచారం.
ఈ మూవీకి మ్యూజిక్ వర్క్ ఇంకా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. రీరికార్డింగ్ పూర్తి కావడానికి ఇంకా టైం పట్టొచ్చని.. డైరెక్టర్ మరికొన్ని సీన్లను రీ షూట్ చేస్తున్నట్టు కూడా సమాచారం. ఈ కారణాలతోనే కింగ్డమ్ జూలై 25కు వాయిదా వేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని కొత్త టాక్. అయితే, కింగ్డమ్ మరోసారి వాయిదా పడనుందనే పుకార్లపై మేకర్స్ స్పందిస్తే ఓ క్లారిటీ వస్తోంది.
ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీ రూ.100కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. హీరో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్స్.