కుటుంబ సభ్యుల మృతదేహాలను గుర్తించలేక..ఇజ్రాయెల్ వాసుల అవస్థలు

కుటుంబ సభ్యుల మృతదేహాలను గుర్తించలేక..ఇజ్రాయెల్ వాసుల అవస్థలు

హమాస్ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారి మృతదేహాల కోసం ఇజ్రాయెల్ సైనిక శిబిరాల వద్ద పడిగాపులు పడుతున్నారు.  దక్షిణ ఇజ్రాయెల్ లోని రామ్లానగరంలో ని సైనిక శిబిరం వద్ద  మృత దేహాలను ఉంచారు. కుటుంబ సభ్యుల మృతదేహాలను గుర్తించేందుకు ఇజ్రాయెల్ వాసులు వరుసలో నిల్చుకున్నారు. అయితే ఎవరు తమ కుటుంబ సభ్యులో గుర్తించలేని పరిస్థితి నెలకొంది.

 సైనికుల మృతదేహాలు ట్యాగ్ చేయబడ్డాయి కానీ.. అక్కడ ఉంచిన మృతదేహాల్లో అత్యధికంగా పౌరులు మృతదేహాలు ఉన్నాయి. సొంత వారిని గుర్తించడమే చాలా కష్టంగా మారిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబ సభ్యులు ఉన్నారా లేరా అనే డైలమాలో అక్కడి పౌరులు ఆందోళనకు గురవుతున్నారు.