కోవసాంత్‎లో చేరిన ఐటీ ఎక్స్‎పర్ట్ ఫణీష్ మూర్తి

కోవసాంత్‎లో చేరిన ఐటీ ఎక్స్‎పర్ట్ ఫణీష్ మూర్తి

హైదరాబాద్​, వెలుగు: ఐటీ ఎక్స్​పర్ట్​, ఐగేట్ మాజీ సీఈఓ ఫణీష్ మూర్తి ఏఐ ఆధారిత సొల్యూషన్స్​అందించే కోవసాంత్‎లో నాన్​–ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​గా చేరారని కంపెనీ తెలిపింది. ఆయన ఇదివరకు ఇన్ఫోసిస్‌‌‌‌లో కీలక స్థానాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఐగేట్‌‌‌‌ను విజయపథంలో నడిపించారని, ఇప్పుడు కోవసాంత్​​తో కలిసి ఏఐ ఆధారిత సేవలను అభివృద్ధి చేస్తారని పేర్కొంది. 

కోవసాంత్ డేటా ఇంజనీరింగ్, ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, సైబర్‌‌‌‌సెక్యూరిటీ, జనరేటివ్ ఏఐ కన్సల్టింగ్ వంటి సేవలను అందిస్తోంది.  కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచుకోడానికి, ఆటోమేషన్‌‌‌‌ను పెంచడానికి ఈ సంస్థ సహాయపడుతుంది.