
హైదరాబాద్, వెలుగు: ఐటీ ఎక్స్పర్ట్, ఐగేట్ మాజీ సీఈఓ ఫణీష్ మూర్తి ఏఐ ఆధారిత సొల్యూషన్స్అందించే కోవసాంత్లో నాన్–ఎగ్జిక్యూటివ్డైరెక్టర్గా చేరారని కంపెనీ తెలిపింది. ఆయన ఇదివరకు ఇన్ఫోసిస్లో కీలక స్థానాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఐగేట్ను విజయపథంలో నడిపించారని, ఇప్పుడు కోవసాంత్తో కలిసి ఏఐ ఆధారిత సేవలను అభివృద్ధి చేస్తారని పేర్కొంది.
కోవసాంత్ డేటా ఇంజనీరింగ్, ఇంటెలిజెంట్ ఇంజనీరింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, సైబర్సెక్యూరిటీ, జనరేటివ్ ఏఐ కన్సల్టింగ్ వంటి సేవలను అందిస్తోంది. కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచుకోడానికి, ఆటోమేషన్ను పెంచడానికి ఈ సంస్థ సహాయపడుతుంది.