తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. కళామందిర్, కాంచీపూరం వర మహాలక్ష్మీ బట్టల షోరూంలలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ,కళామందిర్ గ్రూప్ ఛైర్మన్ ఇళ్లు, డైరెక్టర్ల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఒక్క హైదరాబాద్లోనే 35 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్,గచ్చిబౌలి ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. వైజాగ్ కు చెందిన ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున పన్ను ఎగవేశారన్న సమాచారంతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.