కొత్త నటులతో ఆ సినిమా.. కొంచెం రిస్క్ తో కూడినదే

కొత్త నటులతో ఆ సినిమా.. కొంచెం రిస్క్ తో కూడినదే

ఫిల్మ్ మేకర్ రాజీవ్ రాయ్ అందించిన రెండు చిత్రాలు బాలీవుడ్ చరిత్రలోనే అత్యుత్తమ సినిమాలుగా నిలిచిపోయాయి. అవి మోహ్రా(1994), గుప్త్ (1997). ఈ రెండు చిత్రాల సౌండ్ ట్రాక్ ను సినీ ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోరు. ఇటీవలే ఈ రెండు చిత్రాలూ వార్షికోత్సవాలు జరుపుకున్నాయి. మోహ్రా జులై 1న 28ఏళ్లు పూర్తి చేసుకోగా, గుప్త్ జులై 4న 25ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హంగామాతో  డైరెక్టర్ రాజీవ్ రాయ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

మోహ్రా మూవీలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి నటించారు. వారిని సెలక్ట్ చేయడం వెనుక ప్రత్యేకించి లెక్కలేమీ వేసుకోలేదు. అలా జరిగిపోయిందంతేనని రాజీవ్ తెలిపారు. అయితే కొత్త నటులతో ఈ సినిమా కొంచెం రిస్క్ తో కూడుకున్నదన్నారు. అయినా ఈ సినిమాకు సునీల్, అక్షయ్ సరిపోతారని అనుకున్నానని చెప్పారు. దివ్యభారతి కూడా ఈ మూవీలో చేసేందుకు చాలా ఆసక్తి కనబరిచారని...  కానీ ఆ సమయంలోనే ఆమె అకస్మాత్తుగా మరణించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె స్థానంలో రవీనా టాండన్ ను తీసుకున్నామని రాజీవ్ స్పష్టం చేశారు. మోహ్రాకు ముందు, రాజీవ్ రాయ్ యుధ్ (1985), త్రిదేవ్ (1989), విశ్వాత్మ (1992) చిత్రాలకు దర్శకత్వం వహించారు.