రేపట్నుంచి  మూడు రోజులు వానలు

రేపట్నుంచి  మూడు రోజులు వానలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచుతుంటే.. మరోవైపు రైతులను ఇబ్బందులు పెట్టేలా వానలు ముసురుకోనున్నాయి. శనివారం నుంచి రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిం చింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానల ప్రభావం ఉంటుందని పేర్కొంది. నల్గొం డ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నాగర్​కర్నూల్​, వనపర్తి, రంగా రెడ్డి, వికారాబాద్​, మహబూబ్​నగర్​, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనావేసింది. వానలతో పాటే టెంపరేచర్లూ తీవ్రంగా ఉండే అవ కాశం ఉందని హెచ్చరించింది. గురు వారం రాష్ట్రవ్యాప్తంగా ఎండ మంట కొన సాగింది. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికా ర్డయింది. కరీంనగర్​ జిల్లా తంగులలో 45.6, నల్గొండ జిల్లా దామరచర్లలో 45.5, కరీంనగర్​ జిల్లా వీణవంక, సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.