జాక్వెలిన్ ను 8 గంటలకు పైగా ప్రశ్నించిన పోలీసులు

జాక్వెలిన్ ను 8 గంటలకు పైగా ప్రశ్నించిన పోలీసులు

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం మంగళవారం జాక్వెలిన్ కు సమన్లు జారీ చేసింది. బుధవారం ఉదయం 11.30 గంటలకు దర్యాప్తు సంస్థకు చేరుకున్న ఆమె.. రాత్రి 8 గంటలకు వెళ్లిపోయింది. ఫెర్నాండెజ్‌ను పోలీసులు సుమారు 8 గంటలకు పైగా ప్రశ్నించారు. ఇదే కేసులో మరో బాలీవుడ్‌ నటి నోరా ఫతేహీని కూడా ఢిల్లీ పోలీసులు ఈ మధ్యే ప్రశ్నించారు. సుమారు ఏడు గంటల పాటు ఆమెను పోలీసులు విచారించారు.  

మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ను ఈడీ గతంలో అరెస్టు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్యను రూ.215 కోట్లకు దోపిడీ చేసిన కేసును అతడు ఎదుర్కొంటున్నాడు. వారి వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను సైతం ఈడీ నిందితురాలిగా చేర్చింది. సుఖేశ్ చంద్రశేఖర్ దాదాపు రూ.10 కోట్ల బహుమతులను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు పంపినట్టు దర్యాప్తులో ఈడీ గుర్తించింది.