ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మెరుగైన పనితీరు కనబర్చినందుకు జగన్ ను స్కోచ్ అవార్డుకు ఎంపిక చేశారు. ఇవాళ(మంగళవారం) స్కోచ్ గ్రూప్ సంస్థల అధినేత సమీర్ కొచ్చర్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. ఈ సందర్భగా సీఎం ఆఫ్ ద ఇయర్ గా జగన్ కు స్కోచ్ అవార్డు ప్రదానం చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, దిశ చట్టం, YSR చేయూత వంటి పథకాలను పరిగణనలోకి తీసుకుని సీఎం జగన్ ను సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినట్టు స్కోచ్ గ్రూప్ తెలిపింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కాలంలోనూ 123 పథకాలను అమలు చేయడమే కాకుండా, కొన్ని సాహసోపేత నిర్ణయాలను వైఎస్ జగన్ తీసుకున్నారని సమీర్ కొచ్చర్ చెప్పారు.