
రాజ్యసభలో 12 మంది ప్రతిపక్షాల ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ షాకిచ్చారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గించిన 12 మంది విపక్ష పార్టీల ఎంపీలపై విచారణ చేయాలని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు. బడ్జెట్ సెషన్లో సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని సూచించారు. పార్లమెంట్ తొలి విడత బడ్జెట్ ఇటీవల ముగిశాయి. ఈ సమావేశాల్లో రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. దీంతో ఈ అంశంపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీని విచారణ చేయాలని రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్ ఆదేశించారు.
మొత్తం12 మంది విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల్లో 9 మంది కాంగ్రెస్ కు చెందిన ఎంపీలున్నారు. మిగిలినవాలు ఆప్ సభ్యులు. పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేసిన వారిలో శక్తి సిన్హా, నార్ బాయ్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, కుమార్ కేత్కర్, ప్రతాప్ గర్హి, ఎల్, హనుమంతయ్య, పూలో దేవి నేతమ్, మాథర్ హిషామ్ , రంజిత్ రంజన్ లు కాంగ్రెస్ సభ్యులు కాగా.... సంజయ్ సింగ్ , సుశీల్ కుమార్ గుప్తా, సందీప్ కుమార్ పాఠక్ లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారు.