కాంగ్రెస్ కు 231 ఓట్లు రాకపోతే నేను రాజీనామా చేస్తా..

కాంగ్రెస్ కు  231 ఓట్లు రాకపోతే నేను రాజీనామా చేస్తా..

వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలు ఆపాలన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యే లు కల్లాల దగ్గరకి వెళ్లి రైతులతో మాట్లాడాలన్నారు. ఢిల్లీలో చనిపోయిన రైతుల మీద సానుభూతి చూపించినట్లు.. ఇక్కడి రైతుల గురించి కూడా  కేసీఆర్ ఆలోచించాలన్నారు. తెలంగాణ  బీజేపీ ఎంపీలు,  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీరే అధికారంలో ఉండి.. మీరే కొట్లాడితే ఎలా అని టీఆర్ఎస్, బీజేపీలను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్  ఒకసారి డైరెక్ట్ గా రైతు కల్లాలను  విజిట్ చెయ్యాలన్నారు. మెదక్ జిల్లా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్ కు చెందిన 231 ఓట్లు రాకపోతే..  తాను వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామ చేస్తానన్నారు జగ్గారెడ్డి