పుల్వామా దాడితో సంబంధం ఉన్న జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. సజ్జద్ ఖాన్ అనే జైషే తీవ్రవాది ఢిల్లీలోని సౌత్ ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు.. గురువారం రాత్రి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అతన్ని పట్టుకున్నారు. పుల్వామా దాడి మాస్టర్ మైండ్ ముదస్సిర్ కు సజ్జద్ సన్నిహితుడు. ఇతను పుల్వమా జిల్లాకు చెందిన వ్యక్తి. దాడికి సజ్జద్ బయటనుండి సహాయం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఫొటోలో టీ షర్ట్ వేసుకుని ఉన్న వ్యక్తి సజ్జద్ ఖాన్. నిన్న రాత్రి సజ్జద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం కోర్టులో ప్రవేశ పెట్టారు.
పుల్వామా మాస్టర్ మైండ్ గా చెప్పుకునే ముదస్సిర్ ను ఈ మధ్య బధ్రతా బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.
Jaish-e-Mohammad terrorist Sajjad Khan (in grey sweatshirt) who was arrested by Delhi Police Special Cell, earlier today. He was a close associate of Pulwama attack mastermind Mudassir who had been eliminated earlier this month. pic.twitter.com/TCWdYIQGwt
— ANI (@ANI) March 22, 2019