బీసీనే సీఎం చేస్తామని ప్రకటించాలి: రాహుల్​ గాంధీకి జాజుల వినతి

బీసీనే సీఎం చేస్తామని ప్రకటించాలి: రాహుల్​ గాంధీకి జాజుల వినతి

హైదరాబాద్, వెలుగు: బీసీల విషయంలో కాంగ్రెస్​ రాజకీయ పాలసీ ఏంటో ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ జన గర్జన సభలో ఆ పార్టీ అగ్ర నేత రాహుల్​ గాంధీ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ డిమాండ్​ చేశారు. కర్నాటకలాగానే బీసీలకు జనాభా ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, బీసీలకే సీఎం పదవి ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు. శనివారం ఆయన రాహుల్​ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. కర్నాటక ఫార్ములానే తెలంగాణలోనూ అమలు చేస్తామని ఖమ్మం సభలో రాహుల్​ స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు. అలాగైతేనే కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు.