
సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘అవతార్ 2’ వచ్చేస్తోంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ "అవతార్ ది వే ఆఫ్ వాటర్" అధికారిక ట్రైలర్ను ఆవిష్కరించారు. 2009లో వచ్చిన అవతార్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అవతార్ మూవీకి సీక్వెల్గా వస్తున్న అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా కొత్త ట్రైలర్ విజువల్ వండర్గా ఉంది. దాదాపు రెండున్నర నిమిషాల నిడివి గల ట్రైలర్లో పండోరా ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది. చంద్రుడి పై భూమివంటి నివాసయోగ్యమైన అద్భుతమైన ప్రకృతి దృశ్యం కనులవిందుగా ఉంది. పండోరా నీటి అడుగున వెళుతునప్పుడు చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది.
13 ఏళ్ల నిరీక్షణకు న్యాయం చేసేలా ఈ సీక్వెల్ ట్రైలర్ కళ్లు చెదిరేలా ఉంది. పదేళ్లుగా చిత్రీకరణ కొనసాగుతున్న ఈ సినిమా ఓ విజువల్ వండర్గా ప్రేక్షకులను మరోసారి పండోరా ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. ఈ కొత్త ట్రైలర్ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్) తన కూతురిని పరిచయం చేశాడు. అవతార్లో తమ పండోరా ప్రపంచాన్ని మనిషి నుంచి కాపాడుకోవడానికి అక్కడి జీవులు భూమిపై యుద్ధం చేయగా.. ఈ రెండో పార్ట్లో అది కాస్త నీళ్లలోకి మారింది.
తొలి పార్ట్లో కంటే అద్భుతమైన విజువల్స్ ఈ సీక్వెల్లో ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అత్యాధునిక అండర్ వాటర్ ఫొటోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా జేమ్స్ కామెరాన్ తెరకెక్కించాడు. అవతార్ 2తోపాటు అవతార్ 3 షూటింగ్ను కూడా ఒకేసారి అతడు తెరకెక్కించడం విశేషం. డిసెంబర్ 16న ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.