"అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్" ట్రైలర్ రిలీజ్

"అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్" ట్రైలర్ రిలీజ్

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘అవతార్ 2’ వచ్చేస్తోంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ "అవతార్ ది వే ఆఫ్ వాటర్" అధికారిక ట్రైలర్‭ను ఆవిష్కరించారు. 2009లో వచ్చిన అవతార్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు అవతార్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న  అవతార్ ది వే ఆఫ్ వాటర్ సినిమా కొత్త ట్రైలర్‌ విజువల్‌ వండర్‌గా ఉంది. దాదాపు రెండున్నర నిమిషాల నిడివి గల ట్రైలర్‭లో పండోరా ఎప్పటిలాగే అద్భుతంగా ఉంది.  చంద్రుడి పై భూమివంటి నివాసయోగ్యమైన అద్భుతమైన ప్రకృతి దృశ్యం కనులవిందుగా ఉంది. పండోరా నీటి అడుగున వెళుతునప్పుడు చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది.

13 ఏళ్ల నిరీక్షణకు న్యాయం చేసేలా ఈ సీక్వెల్‌ ట్రైలర్ కళ్లు చెదిరేలా ఉంది. పదేళ్లుగా చిత్రీకరణ కొనసాగుతున్న ఈ సినిమా ఓ విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులను మరోసారి పండోరా ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది. ఈ కొత్త ట్రైలర్‌ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో జేక్‌ సల్లీ (సామ్‌ వర్తింగ్టన్‌) తన కూతురిని పరిచయం చేశాడు. అవతార్‌లో తమ పండోరా ప్రపంచాన్ని మనిషి నుంచి కాపాడుకోవడానికి అక్కడి జీవులు భూమిపై యుద్ధం చేయగా.. ఈ రెండో పార్ట్‌లో అది కాస్త నీళ్లలోకి మారింది. 

తొలి పార్ట్‌లో కంటే అద్భుతమైన విజువల్స్‌ ఈ సీక్వెల్‌లో ఉండబోతున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.  అత్యాధునిక అండర్‌ వాటర్‌ ఫొటోగ్రఫీ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమా జేమ్స్‌ కామెరాన్‌ తెరకెక్కించాడు. అవతార్‌ 2తోపాటు అవతార్‌ 3 షూటింగ్‌ను కూడా ఒకేసారి అతడు తెరకెక్కించడం విశేషం. డిసెంబర్ 16న ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.